గుండాల మే 23( మన్యం టీవీ) గుండాల ప్రభుత్వ వైద్యశాలకు ఇంచార్జ్ వైద్యుణ్ని నియమించడం హర్షనీయమని గుండాల ఎంపీటీసీ సంధాని అన్నారు. కొద్ది రోజుల క్రితం వైద్యుడు కరోనా బారిన పడడంతో ప్రజలకు ఇబ్బందులకు గురవుతారని ఉన్నత అధికారులకు చెప్పిన వెంటనే వారు స్పందించి ఇన్చార్జి వైద్యుణ్ని నియమించడం ఆనందంగా ఉందన్నారు. దానితోపాటు స్థానిక వన్ జీరో ఎయిట్ కొత్తగూడెం కి కేటాయించి ప్రజల ఇబ్బందిని గమనించి మళ్లీ గుండాలకు కేటాయించినందుకు ఉన్నత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. మారుమూల మండలమైన గుండాలకు ఉన్నతాధికారులు అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు
Post A Comment: