👉నున్నా శేషగిరిరావు సేవలు అభినందనీయం
👉బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
మన్యం టీవీ, భూర్గంపాడ్:
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ముసలమడుగు,కృష్ణసాగర్ గ్రామ పంచాయతీలలో 90 మంది కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు మణుగూరు క్రాస్ రోడ్డుకి చెందిన నున్నా శేషగిరిరావు గారు
తన సొంత ఖర్చులతో సమకూర్చిన నిత్యవసర సరుకుల కిట్లను(కూరగాయలు,మాంసం,గుడ్డు)ఈరోజు బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపెట్టాలి అని అన్నారు.కరోనా బాధిత కుటుంబాలకు నున్నా శేషగిరిరావు చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు కుర్సం వెంకటరమణ,కోడిమె వెంకటేశ్వర్లు,స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్సం వెంకన్న,స్థానిక వార్డుసభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: