మన్యం టీవీ, కరకగూడెం:
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ అందించి రోగులకు అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు అన్నారు.
కరకగూడెం ఏజెన్సీ మండలంలో రోగులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న విపత్కర పరిస్థితుల్లో పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి తనయుడు విశ్వభరత్ రెడ్డి(ఎన్ఆర్ఐ)మంచి ఆలోచనతో తమవంతు సాయంగా కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు చేతులమీదుగా ఇంచార్జి వైద్యాకారి శివకుమార్ అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా మాట్లాడుతూ....ఎన్ఆర్ఐ
విశ్వ భరత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంల్లో ప్రజల కోసం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని రేగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,భూర్గంపహడ్ వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,ఆత్మ కమిటి డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,యలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,రేగా సత్యనారాయణ,గొట్టముక్కల ఉప్పల్ రెడ్డి,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: