మన్యం టీవీ డెస్క్:
ఎన్టీపీసీ, మే 31: సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ ఆదేశాల మేరకు సోమవారం నాడు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఇందిరమ్మ కాలనీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు వాడలోని నీరుపేద పిల్లలకు మాస్కులు శానిటైజర్ లు , పండ్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చిన్నయ్య సేవలు గుర్తు చేశారు , ఇటీవల స్థానిక శాలేపల్లి కి చెందిన నిరుపేద యువతి ఉమారాణి వివాహానికి 20 వేలు ఆర్థిక సహాయం అందించారన్నారు. రాబోయే కరోనా మూడో దశ విషయంలో చిన్నపిల్లల తల్లిదండ్రులకు తగుజాగ్రత్తలు తెలిపారు. నిరుపేద దళిత పిల్లలు ఉన్నత విద్యపై దృష్టి సారించాలని, అక్షరాస్యులుగా ఎదిగినప్పుడే పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దుర్గం విశ్వనాధ్ ముడిమడుగుల సురేష్, కుమ్మరి యువరాజ్, దుర్గం శ్రీనివాస్, దూటరాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: