👉 నీటిపారుదల డీఇ కి వినతి పత్రం ఇచ్చిన న్యూ డెమోక్రసీ నాయకులు
గుండాల ( మన్యం టీవీ) ఏడు మెలికల వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ఇసుకతో కూరుకుపోయిందని ఇసుకను తొలగించాలని నీటిపారుదలడీఇ జాని కి వినతి పత్రాన్ని పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి అందజేశారు. ఈ చెక్ డ్యాం ద్వారా నీళ్లు మూడు గ్రామాల్లోని నాలుగు చెరువులకు చేరుతాయి అన్నారు. వందల ఎకరాల భూమి సాగుతుందని అన్నారు. చెక్ డ్యాం పై పేరుకుపోయిన ఇసుకమేట లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. శాశ్వత పరిష్కారం చూపి నీళ్లు అందేలా చూడాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో కొడవటంచ గ్రామస్తులు ఈసం సమ్మయ్య, ఈసం బొమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: