CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

Share it:

 కరోనా బాధితులకు అండగా ఉంటా:సర్పంచ్.



 మన్యం టీవీ కరకగూడెం : పినపాక నియోజకవర్గ ఏజెన్సీ కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామపంచాయతి పరిధిలో గ్రామల్లో కరోనా నిర్ధారణ కావడంతో కరోనా బాధిత కుటుంబాలకు అనంతారం గ్రామపంచాయతి సర్పంచ్ బత్తిని నర్సింహారావు అండగా నిలిచి,ఐదు రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ బత్తిని బత్తిని నర్సిహరావ మన్యం టీవీ తో మాట్లాడుతూ రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు.కరోనా బారినపడి హోం క్వారంటైన్ లో ఉన్న బాధితుల వద్దకు నేరుగా వెళ్ళి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

కరోనా వైరస్ బాధిత కుటుంబాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని,వారి పట్ల వివక్షత చూపవద్దని సూచించారు.ప్రతి ఒక్కరూ 

జాగ్రత్తగా ఉంటేనే కరోనా వైరస్ అరికట్టవచ్చన్నారు.

కరోనా వైరస్ బాధితులు భయపడకుండా డాక్టర్లు చెప్పిన సూచనలు,సలహాలు పాటించాలని తెలిపారు.

Share it:

Post A Comment: