టి మాల మహా నాడు జిల్లా అధ్యక్షుడు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ సబ్యుడు రాజమల్ల సుకుమార్
మన్యం టీవీ మంగపేట.
కరోనా కష్ట కాలంలో రేషన్ బియ్యానికి ఓటిపి లింక్ తో పాటు ఐరిష్ తొ కుడా బియ్యం ఇవ్వాలని ఓటిపి ఉంటే బియ్యం ఇవ్వడం సరి కాదని లేదా పాత పద్దతిలో అయిన రేషన్ కార్డుల ద్వార బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ మాల మహా నాడు జిల్లా అధ్యక్షుడు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రాజమల్ల సుకుమార్ అన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కరోనా కష్ట కాలం ముగిసే వరకు ఓటిపితో సంబంధం లేకుండా ఐరిష్ విధానంతో లేదా పూర్వం మాదిరిగా కార్డు ద్వార ఇవ్వాలని సూచించారు.ఓటిపితో బియ్యం ఇవ్వడం వల్ల మారుమూల గ్రామలలో సిగ్నల్ ప్రాబ్లమ్ వల్ల కుడా చాలామంది సమయానికి బియ్యం తీసుకోలేని పరిస్థితి నెలకొందని చాల మందికి సెల్ ఫోన్లు ఉన్న ఓటిపిని చూసి చూపేందుకు రావడం లేదని అన్నారు.మండలంలో కొన్ని గ్రామాల్లోని రేషన్ డీలర్లు ఓటిపి ఉంటేనే బియ్యం ఇస్తా అంటూ ఓటిపి చేపించుకొని రండి అని ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు కూడ ఉన్నాయని ఐరిస్ విధానంతో బియ్యం ఇవ్వాలని కరోనా లాక్ డౌన్ లో ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని సెల్ ఫోన్లను రేషన్ డీలర్లు ముట్టుకొని ఓటిపి స్వయంగా తెలుసుకోవడం వల్ల కుడా కరోనా వైరస్ వ్యాపి చెందేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం ఈ విషయంను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎలాంటి షరతులు లేకుండా బియ్యాన్ని పంపిణీ చేయాలని తెలంగాణ మాల మహా నాడు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ సభ్యులు సుకుమార్ సూచించారు.
Post A Comment: