తగు జాగ్రత్తలు పాటించండి: ఎంపీపీ పినపాక
మన్యం మనుగడ ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో కరోనా ప్రళయ తాండవం చేస్తుందని, పినపాక మండల ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మండల ప్రజలకు ఒక ప్రకటనలో తెలియజేశారు. పినపాక మండలం లోని ని బోటి గూడెం గ్రామంలో శుక్రవారం రోజున ఒక్కసారిగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలనే 12 కేసులు నమోదయ్యాయని ఒక పంచాయతీ లోనే మొత్తం39 కేసులు నమోదయ్యాయని, మండలంలోని అన్ని పంచాయితీల పరిస్థితి ఇలాగే ఉందని,ఇప్పటికైనా తగు జాగ్రత్తలు పాటించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ లాక్ డౌన్ ను ఎంత కఠినంగా అమలు పరిచిన ప్పటికి, పోలీసువారి కళ్లుగప్పి ఏదో సాధించామని, ఎవరికి వారు బహిరంగంగా తిరుగుతూ, కరోనా బారిన పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వైద్య శాఖ ఎప్పటికప్పుడు కరోనా నియమ నిబంధనలు గురించి వివరిస్తున్న మాకేం కాదులే అని, మూర్ఖంగా ప్రవర్తిస్తూ కరోనా బారిన పడుతున్నారని, ఇప్పటికైనా మండల ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ, కరోనా బారిన పడకుండా సంతోషకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.
Post A Comment: