మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,రామనుజవరం గ్రామ పంచాయితీ లో కరోనా మహమ్మారి బారినపడి కమ్మకట్ల నరసింహారావు,బోయిళ్ళ నరసింహారావు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై కరోనా ప్రభావం ఎక్కవడంతో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.వీరి ఇద్దరికి కుడా ముగ్గురు అమ్మాయిలు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా *యడారి సాంబశివరావు, సౌజన్య దంపతులు* హైదరాబాద్ లో ఉద్యోగులు బాధిత కుటుంబాలకు తనవంతు సహాయంగా తన కుమారులు యడారి మౌర్య సీతారాం,కీర్తి ఆదిత్య చేతుల మీదుగా రూ.10,000 రూపాయలు నగదు రెండు కుటుంబలకు అందజేశారు.అంతేకాకుండా రామనుజవరం గ్రామంలో పాముల సంతోష్,కీర్తిల తల్లి కొంతకాలం క్రితం అనారోగ్యం తో మరణించారు.సంతోష్,కీర్తిలకు కుడా యడారి. సాంబశివరావు,సౌజన్య దంపతులు రూ.10,000 రూపాయలు ఫిక్సడ్ డిపాజిట్ చేశారు.ఈ కార్యక్రమంలో యడారి క్రిష్ణ,నోముల సురేష్, వడ్లకొండ మహేష్,జీవన్ రెడ్డి,సంతోష్ రెడ్డి,వెంకట్ రెడ్డి,సాయి,మురళి,క్రిష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: