తెలంగాణ అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాళ్లు...
మన్యం టీవీ పాల్వంచ :-
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పాత కొత్తగూడెం ఏరియాలో గల జ్యోతి వృద్ధ అనాథ శరణలయంలో మరియు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ పరిధిలోని యాచకులకు...
*స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో తెలంగాణ అంబేద్కర్ మహిళ సంఘం నాయకురాళ్లు మాట్ల గాయత్రి, కెడెం కృపావేణి, నక్కా సృజన, ఆశ వర్కర్ భూక్య గంగా గార్ల ఆధ్వర్యంలో* పాలు, పండ్లు, బ్రెడ్డు, గుడ్డుతో కూడిన పౌష్టికాహార, అల్పాహారంతో పాటు మాస్కులు కూడా పంపిణీ చెయ్యడం జరిగింది...
ఈ సందర్భంగా మహిళ సంఘ నాయకురాళ్లు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఇలాంటి వృద్ధ అనాథలకు మరియు యాచకులకు తమకు తోచిన సహాయం చెయ్యడం ఎంతో ఆనందంగా ఉంది అని అలాగే ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం అందించుటకు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు...ఈ సందర్భంగా మహిళ సంఘ నాయకురాళ్ల దృష్టికి వచ్చిన విషయం ఏమనగా ఇంకా ఈ జ్యోతి వృద్ధ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులకు ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగలేదు అని దయచేసి ఇలాంటి అనాథ వృద్ధులకు ముందస్తు ప్రయారిటీ ఇచ్చి వ్యాక్సిన్ వేపించ వలసిందిగా అనాథ శరణాలయం యాజమాన్యం కోరడమైనది...
ఈ కార్యక్రమంలో మాట్ల భాగ్యరాజ్, కెడెం సాంసన్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: