CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూన్‌ 15 నుంచి రైతుబంధు సాయం పంపిణీ..

Share it:

 


 తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయ‌నున్నారు. జూన్ 25 లోగా రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ పూర్తి కానుంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయ‌శాఖ‌పై చేసిన స‌మీక్ష‌లో నిర్ణ‌యం తీసుకున్నారు. పార్ట్-బి నుంచి పార్ట్‌- ఏలోకి చేరిన రైతుల‌కు రైతు బంధు వ‌ర్తించ‌నుంది. జూన్ 10 క‌టాఫ్ తేదీగా ఈ ప‌థకం వ‌ర్తింపు ఉండ‌నుంది. విత్త‌నాలు, ఎరువుల్లో క‌ల్తీని అరిక‌ట్టాల‌ని స‌మీక్ష సంద‌ర్భంగా సీఎం నిర్ణ‌యించారు. క‌ల్తీ నివార‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే ఆర్డినెన్స్ జారీ చేయాల‌న్నారు.

Share it:

Post A Comment: