మన్యం టివీ, అశ్వాపురం:మొండికుంట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్దే లక్ష్యం గా కృషి చేస్తున్నామని సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అన్నారు. ఈ రోజు మొండికుంట గ్రామ పంచాయతీ లో పంచాయితీ నిధులతో మొండి కుంట లో రూ. 16 లక్షలు (400 మీటర్లు), బీ జీ కొత్తూరు లో రూ.6 లక్షలు(150 మీటర్లు) తో సీ సీ రోడ్ల నిర్మాణం కు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తాను ఈ పదవీ కాలంలో గ్రామ పంచాయితీ లోని అన్ని అంతర్గత గ్రావెల్ రహదారులను గౌరవ శాసనసభ్యులు రేగా కాంతారావు సహాయ సహకారములతో, పాలకవర్గం ఆధ్వర్యంలో సీసీ రోడ్లు గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్,ఎంపీటీసీ నరేష్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, గ్రామ పెద్దలు జాలే రామకృష్ణారెడ్డి, ముస్కు శ్రీనివాసరెడ్డి, తెరాస నాయకులు గోపిరెడ్డి, వార్డు సభ్యులు పాయం రాజేశ్,కొల్లు ఉప్పల్ రెడ్డి, పసుల లింగయ్య , వీరారెడ్డి,పంచాయితీ రాజ్ ఏఈ చారీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: