మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం మండలం లో ఘనవ్యర్దాల నిర్వహణ లో భాగంగా మండల పరిధిలో గల అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయంలో తడి పొడి చెత్తసేకరణ మరియు నిర్వహణపై వాష్ ప్రోగ్రాం ఐ.ఈ.సి.(ఇన్ఫర్మేషన్ ఎడ్యూకేషన్ కమ్యూనికేషన్ )అవగాహన పుస్తకములను 24 గ్రామ పంచాయతీ కార్యదర్శులకుపంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ITC వారు చేస్తున్న కృషి ప్రశంశనీయమని, స్వచ్చందంగా వారు చూపుతున్న శ్రద్దకు ధన్యవాదాలు తెలుపుతూ కార్యదర్శులు అందరు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాలలో తడిపొడి చెత్తను సేకరించాలని, గ్రామపంచాయతీల డంపింగ్ షెడ్ లలో వర్మీకంపోస్ట్ తయారుచేయటం ప్రారంభించాలని ఆదేశించుట జరిగింది. ఈకార్యక్రమంలో ఎమ్మార్వో సురేష్ కుమార్, ఎం పీ ఓ శ్రీనివాస్, ఏపీవో విజయలక్ష్మి, మండల వైద్యాధికారి మణికంఠ రెడ్డి, ఐటీసి వాష్ ప్రోగ్రాం ట్రైనర్ జక్కుల సందీప్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: