మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో గ్రామీణ ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నయి.ఈ క్రమంలో మండలంలోని మాచినేని పేట గ్రామపంచాయతీలో కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితులు వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉంటున్నారు. కరోనా బాధిత పేద కుటుంబాలకు మాచినేని పేట గ్రామపంచాయతీ సర్పంచ్ లావుడ్యా భారతి, మాజీ సర్పంచ్ లకావత్ గిరిబాబు, దంపతులు సోమవారం వారిని కలిసి వారిలో ధైర్యాన్ని నింపి, అధైర్య పడవద్దని, మేమున్నామని భరోసా కల్పించారు. వారికి కావలసిన నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
Post A Comment: