కరోనా వ్యాక్సినేషన్ కు పెరుగుతున్న ఆదరణ...
మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని గ్రామాలలో గత వారం రోజులుగా కరోనా కేసులు, రోజురోజుకు పెరుగుతుండడం తో, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సోమవారం మరో 19 కరోనా కేసులు నమోదు అయ్యాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సోమవారం 87 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 19 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గ్రామాల వారిగా, వెంగన్నపాలెం,(3) పడమట నర్సాపురం,( 2 ) అన్నారుపాడు, (2 )సూరారం, (1) చీపురుగూడెం, (1) కొత్తూరు, (3) జూలూరుపాడు,( 1 ) పాపకొల్లు, (1 ) గుండ్లరేవు, (1) కొమ్ముగూడెం, (1 ) మాచినపేట, (1) దండు మిట్ట తండా,( 1 ) ఇతరులు,( 1 ) గా కేసులు నమోదు కాగా, అదే స్థాయిలో గ్రామాల నుండి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఆదరణ చూపుతున్నారు. సోమవారం కరోనా వ్యాక్సిన్ ను 120 మంది తీసుకున్నట్లు సిహెచ్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
Post A Comment: