CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వ్యాక్సిన్ సురక్షితం ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి

Share it:

 



కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు


మన్యం టీవి మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో శుక్రవారం మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,జిల్లా ఎంపీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల. కృష్ణ,కరోనా వాక్సిన్   వేయించుకోటం జరిగింది.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి గ్రామాల్లో, పట్టణాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలి అన్నారు.ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వాక్సిన్ ను ప్రజలందరూ స్వచ్చందగా వెళ్లి,భయాందోళనకు గురి కాకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ  వైద్యశాలల్లో   వైద్యుల పర్యవేక్షణలో 45 సంవత్సరాలు దాటిన స్త్రీ,  పురుషులు వాక్సిన్ టీకా ను, తీసుకోని ఈ మహమ్మారి ని  తరిమికొట్టాలని అన్నారు. అయితే కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ వెనక మితిమీరిన నిర్లక్ష్యమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.మాస్కులు ధరించకపోవడం,భౌతిక దూరాన్ని పాటించకపోవడం, వల్ల వైరస్‌ వ్యాప్తి అనేది వేగంగా జరుగుతుంది అని వైద్యులు చెబుతున్నారు.ఈ క్రమంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికి,ప్రతి వ్యక్తి స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప కరోనా కట్టడి సాధ్యం కాదని,ప్రతిఒక్కరు తమ బాధ్యతగా కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటేనే,వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం. విజయకుమారి,డాక్టర్ మౌనిక,ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనికప్రసాద్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,నాయకులు వెంకటరెడ్డి,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: