మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయ అడిషనల్ డిఆర్డిఓ అధికారి-రాయ్ విశ్వనాధ్ సుబ్రహ్మణ్యం. అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం(ఎర్రగుంట) గ్రామంలోని పల్లె ప్రకృతి వనలు, అవెన్యూ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, హార్టికల్చర్ ప్లాంటేషన్, రైతు వేదిక నందు గల కమ్యూనిటీ ప్లాంటేషన్ లను సందర్శించారు. ఈ సందర్శనలో స్థానిక రైతు బోయినపల్లి సత్యనారాయణ హార్టికల్చర్ ప్లాంటేషన్ పరిశీలించి, ఎంతో శ్రద్ధతో ఐదు ఎకరాల్లో మామిడి మొక్కలను పెంచుతూ, సంరక్షిస్తున్నందుకు వారిని అభినందించారు. ఆర్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భావితరాల వారికి ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం నర్సరీలను ఏర్పాటు చేసిందని, మానవాళి మనుగడకు ముఖ్య ప్రాణాధారమైన పచ్చని మొక్కలను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత అని, మొక్కలు పెంచడం వలనే సకాలంలో వర్షాలు పడి రైతులకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకోబడతాయని, ప్రతి ప్లాంటేషన్లు వద్ద పని అంచనా విలువల సమాచారంతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయించాలని, మండల అధికారులకు సూచించారు. ఈ సందర్శనలో వారి వెంట మండల ప్రజా పరిషత్ అధికారి జి రేవతి, పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అగ్గి కవిత, డిఆర్డిఎ ములకలపల్లి క్లస్టర్ ప్లాంటేషన్ సూపర్వైజర్ ఎస్ నాగమణి, ఈజీఎస్-ఏపిఓ వెంకటేశ్వరరావు, టిఎ-జ్యోతి, పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి-విజయ్, గుంపెన గ్రామ పంచాయతీ కార్యదర్శి-నాగేశ్వరరావు,పంచాయతీ సిబ్బంది, రైతులు ఉన్నారు.
Post A Comment: