CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామనుజవరం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎంపీపీ కారం. విజయకుమారి

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని రామనుజవారం గ్రామ పంచాయతీ  లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ని శుక్రవారం ఎంపీపీ కారం. విజయ కుమారి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతు బీమా,రైతు బంధు,సబ్సిడీ విత్తనాలు, ఎరువులు,24 గంటల ఉచిత విద్యుత్,సాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు పండించిన ధాన్యమును ప్రభుత్వమే రూ.1888 ల మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొన్న డబ్బులను వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పోశం.నరసింహారావు,తహసీల్దార్ చంద్ర శేఖర్,ఎంపీడీఓ వీరబాబు,సొసైటీ చైర్మన్ కుర్రి.నాగేశ్వరావు,వైస్ చైర్మన్ దొండేటి. రామమోహనరావు,సీఈఓ జ్ఞానదాస్,సొసైటీ డైరెక్టర్ లు,మండల కో ఆప్షన్ జావిద్ పాషా,సర్పంచ్ బి.సతీష్,ఉప సర్పంచ్ ప్రభుదాస్,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, వెంకటరెడ్డి,తంత్రపల్లి.కృష్ణ,తాత రమణ,సొసైటీ సిబ్బంది,స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: