మన్యం టీవీ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
ఈరోజు దమ్మపేట మండలంలో దమ్మపేట మండల విద్యా వనరుల కేంద్రంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల యొక్క మూడు నెలల బకాయిలను చెల్లించాలని స్థానిక మండల విద్యాశాఖాధికారి ఎం ఈ ఓ కేసర లక్ష్మి కి వినతిపత్రం అందించడం జరిగింది.అలాగే ప్రైవేటు టీచర్లకు ఇస్తున్న రెండువేల రూపాయలను 25కేజిల బియ్యం ను వాలంటీర్ల కూడా వర్తింపజేయాలని శనివారం 2021-2022 విద్యా సంవత్సరంలో వాలంటీర్లు కొనసాగిస్తూ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ పీఆర్సీ నివేదిక ప్రకారం కనీస వేతనాలు విద్యావంతులు కూడా వర్తింపజేయాలని కోరుతూ ఎమియోకి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల విద్యావనరుల సంఘం కాసుమాల నాగరాజు,రజని, రాజేశ్వరి,గోపాలస్వామి,బాల రాజు,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: