🔥 వైద్య ఆరోగ్య శాఖ-జేఎసి 🔥
మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి::- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పై జరిగిన దాడులను ఖండిస్తూ, వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం (ఎర్రగుంట) గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది. ఆస్పత్రి ఎదుట నిరసనలు వ్యక్తపరిచారు. వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో కూడా ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను, సిబ్బందిని గౌరవించకుండా, ఇలా దాడులు చేయడం చాలా బాధాకర విషయం అని, వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలే తప్ప, వైద్యుల పై దాడులు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు పి సుశీల , సభ్యులు ప్రేమలత , వైద్య ఆరోగ్య శాఖ జేఏసీ రాష్ట్ర బాధ్యులు-(డిపిఎంఓ) ఐ వెంకటేశ్వర్లు , జి పుల్లమ్మ , ఆరోగ్యశాఖ జేఏసి కో-కన్వీనర్-(హెచ్ ఓ) పోలెబోయిన కృష్ణయ్య , నాగజ్యోతి , కోటేశ్వరరావు ,ఎల్ టి కిరణ్, లక్ష్మి ,ఎస్ ఎన్ సుహాసిని, సిహెచ్ ప్రసాద్ ,ఆశా కార్యకర్తలు , సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: