హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలో పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ప్రకటించారు. ఎస్ఎస్ఈ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానం ద్వారా ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. పరిస్థితులు మెరుగయ్యాక పరీక్షలు రాసేందుకు అవకాశమిస్తామని వెల్లడించింది
Post A Comment: