నిర్లక్ష్యం వద్దు: డాక్టర్ శివ కుమార్
పినపాక మండలం లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పినపాక ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శివకుమార్ తెలిపారు. ప్రస్తుత కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని వారు తెలిపారు. గతంలో కుటుంబంలో ఒకే కరోనా పాజిటివ్ వచ్చినా , మిగిలిన కుటుంబ సభ్యులకు వైరస్ సోకడానికి కొన్ని రోజుల సమయం పట్టేదని కాని ప్రస్తుతం వైరస్ కుటుంబం లో ఒక్కరికి వచ్చినా తక్కువ సమయంలోనే కుటుంబ సభ్యులకు సోకుతుందని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత గతం కంటే ప్రస్తుతం చాలా తీవ్రంగా ఉందని కరోనా పాజిటివ్ వచ్చిన వారికి తీవ్రమైన జ్వరం వస్తుందని, జ్వరం తగ్గడానికి చాల రోజుల సమయం పడుతుందని తెలిపారు. కొందరు ప్రజలు కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఇలాంటి అత్యవసర పరిస్థితులలో నిర్లక్ష్యం తగదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మండలంలో ఈరోజు వరకు ఉన్న యాక్టివ్ కేసుల వివరాలు
యాక్టివ్ కేసులు మొత్తం 80
తోగ్గూడెం : 50
గోవిందాపురం : 10
బొమ్మరాశిపల్లి : 10
బయ్యారం : 3
ఎల్చిరెడ్డిపల్లి : 7
మండలంలో నలభై అయిదు సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు రేపు పినపాక ప్రభుత్వ వైద్యశాలలో కోవాగ్జిన్ టీకా ఇవ్వడం జరుగుతుందని మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీకా తీసుకున్న వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదనీ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని తెలిపారు.
వ్యాక్సిన్ తీసుకొవడానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ తీసుకురావాలని కోరారు
Post A Comment: