CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సమస్య పరిష్కారం చేయండి

Share it:

 


 👉ప్రభుత్వ అటవీ అధికారులకు సిపిఐ విజ్ఞప్తి 

మన్యం టీవీ,అశ్వాపురం :మండలం లో గిరిజన గ్రామాలలో నెలకొని ఉన్న పొడు భూముల సమస్య పరిష్కారం చెయ్యాలాని  సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు గురువారం తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ పొడు భూములలో లో ఆందోళన చేస్తున్న గిరిజన రైతులకు సిపిఐ నాయకులు మద్దతూ తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు అనేక సంవత్సరాలనుండి సాగు చేసుకుంటున్న పొడు భూములను హరితహారం పేరుతో గుంజుకొని పేద రైతులకు అన్యాయం చేస్తున్నారని కుర్చీ ఏసుకొని కూర్చొని పట్టాలు పంపిణి చేస్తాం అని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నేడు అటవీ అధికారులు భూములు చుట్టూ కందకాలు తొవ్వి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటే   ప్రేక్షక పాత్ర వహిస్తూన్నారని  ఇకనైనా ప్రభుత్వ అటవీ అధికారులు సమస్య పరిష్కారం చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పాయం శ్రీను, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరావు, మండల కార్యదర్శి అనంతనేని సురేష్ , ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్, నెల్లిపాక సొసైటీ డైరెక్టర్ కోడి వెంకన్న,  కల్తీ సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: