మండల అధ్యక్షులు, కార్యకర్తలు సమన్వయం తో పార్టీ అభివృద్ధి కి కృషి చేయాలి:విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తల సమావేశం ను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరితగతిన టిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలు,గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశించారు. మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు,నాయకులకు, ప్రజా ప్రతినిధులకు పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు.ప్రతి ఒక్క కార్యకర్త మండల అధ్యక్షులు,ముఖ్య నాయకుల సమన్వయం తో గ్రామ కమీటీ,బూత్ కమిటీ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడడంతో ఆ భద్రాద్రి సీతారాముల వారి ఆశీస్సులతో,వన దేవతలు సమ్మక్క,సారాలమ్మ ల ఆశీస్సులతో వారు త్వరగా కొలుకొని,ర్రాష్టాన్ని ప్రగతి పధంలో నడిపించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య,జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఏడూ మండలాల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు,జడ్పీటీసీ లు,వర్కింగ్ ప్రెసిడెంట్ లు,ముఖ్య నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: