*కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడం లో ప్రజలందరూ సహకరించాలి.
*నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
*ఏటూరునాగారం ఏఎస్పి గౌస్ ఆలం ఐపీఎస్.
మన్యం టీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం లోని అన్ని వర్తక వాణిజ్య సంఘాల వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి
ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం
నైట్ కర్ఫ్యూ ఆదేశాలకు అనుగుణంగా ఏటూర్ నాగారం వర్తక వాణిజ్య వ్యాపారస్తులు రాత్రి ఎనిమిది గంటలకే తమ దుకాణాలను మూసి వేయాలని అన్నారు.
అలాగే మాస్క్ ధరించి
సామాజిక దూరం పాటించాలి.
ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం కరోనా కట్టడి విషయంలో వర్తక సంఘాల వారు, ప్రజలు అందరూ సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Post A Comment: