మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని నిర్వాసిత కొత్త మల్లె పెల్లి గ్రామంలో గత మూడు,నాలుగు రోజుల నుండి వరుసగా ఇద్దరు చని పోవడం మూలంగా గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న మణుగూరు జడ్పిటిసి నరసింహారావు, శుక్రవారం గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా చనిపోయిన వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,మండల అధ్యక్షుడు ముత్యం బాబు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాష, రామనుజవరం ఉప సర్పంచ్ ప్రభుదాసు,రామ సహాయం, వెంకట్ రెడ్డి,తంత్ర పల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: