మన్యం న్యూస్ గుండాల: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం గుండాల మండల కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల నుండి రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏమాత్రం సమస్యను వద్దు మనకేలా చూడకపో గా వారిని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు రాబోవు కాలంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయక తప్పదన్నారు రైతుల సమస్యల కోసం ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు గత వారం రోజులుగా అక్కడ అక్కడ అకాల వర్షం వల్ల మిర్చి మొక్కజొన్న వరి పంటలు దెబ్బతిన్నాయని వెంటనే రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో చిన్న చంద్రన్న చంద్ర అరుణ ప్రభాకర్ మాచర్ల సత్యం లక్ష్మి శంకర్ శాంతయ్య పీ వై ఎల్ నాయకులు అజయ్ చంద్ర బోస్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: