మన్యం టీవీ, అశ్వరావుపేట:
ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు స్థాపించిన మన్యం మనుగడ పత్రిక ద్వారా వచ్చిన ప్రత్యేక సంచికను అశ్వారావుపేట మండలం పేరాయి గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమతి స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సుమతి మాట్లాడుతూ పార్టీ ఏదైనా తను నమ్మిన సిద్ధాంతాలు మీద తన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న గొప్ప వ్యక్తి రేగా కాంతారావు అని, ప్రజలు శ్రేయస్సు కొరకు ప్రత్యేకంగా పత్రికను స్థాపించడం శుభ పరిణామమని, ప్రత్యేక పత్రిక అందించిన అశ్వారావుపేట మండలం మన్యం టీవీ ప్రతినిధి దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మన్యం టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువకుడు రామకృష్ణ పాల్గొన్నారు.
Post A Comment: