మన్యం టీవీ, అశ్వాపురం:
గత ఐదు రోజులుగా తుమ్మలచెరువు పోడు భూమి సాగుదారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి మద్దతు గా అక్కడే ఉండి ఎమ్మెల్యే సీతక్క తో కూడా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడించడం జరిగిందన్నారు. కపోడు సాగుదారుల దీక్ష తో ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి భూమి చదును పనులను ఆపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న టువంటి పోడు భూమి నుండి గిరిజనులనుదూరం చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల విషయంలో గిరిజనులకు న్యాయం చేస్తాం అన్నమాట నిలుపుకోవాలని అన్నారు పోడు సాగు దారు లందరికీ హక్కు పత్రాలు కల్పించి రైతుబంధు వర్తింప చేసి వారిని ఆదుకోవాలని అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు నీటిని వారికి సాగు నీరు అందించి రెండు పంటలు పండించుకునే ల సహకరించి ప్రోత్సహించాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ బేతం రామకృష్ణ ఓరుగంటి బిక్షమయ్య కొండ బత్తుల ఉపేందర్ మానాది సైదులు ,బచ్చు వెంకటరమణ పాములు చంచల రాము చాప ముత్తయ్య వంక సత్యనారాయణ వెంకటాపురం సర్పంచ్ మడకం సాదు నాలుగు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: