👉భారీ ఖర్చుకు సైతం వెనుకాడని వైనం, విలువైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం సివిల్స్,ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగం కోచింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత కు చేయూత నిస్తూ రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను అందచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రేగా కాంతారావు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో యువత చదువుకోవడానికి,కొంచింగ్ లు తీసుకోవడానికి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న పేద నిరుద్యోగులను,విద్యార్థుల ను గవర్నమెంట్ ఉద్యోగులు గా,టీచర్లు,ఐఏఎస్,ఐపీఎస్ లను తయారు చెయ్యాలనే లక్ష్యం తో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు,యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయ కుమారి, పిఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, హర్షవర్ధన్,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్, టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీను,మేకల.రవి, యువజన నాయకులు బొశెట్టి.రవి ప్రసాద్,సృజన్, టిఆరేస్వి నాయకులు,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: