CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిసిసి,ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించిన భూపాలపల్లి-ములుగు జిల్లాల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య

Share it:

 


మన్యం టీవీ ఏటూరునాగారం:

 బుధవారం ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరునాగారం, గోవింద రావుపేట మండల కేంద్రములలో,గ్రామాల్లో జీసీసీ,ఐకేపీల  ఆధ్వర్యంలో  నిర్వహించిన కొనుగోలు కేంద్ర కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ పల్లా బుచ్చయ్య  స్థానిక,సర్పంచ్ లు,ఎంపిటిసీ లు యంపీపి,ఏవో,ఏఈఓల తో కలిసి ప్రారంభించారు. అనతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు లకు అండగా నిలిచి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది, అని అన్నారు. ప్రభుత్వ అధికారులు రైతులకు అండగా నిలిచి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేవిధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లు  అల్లెం ప్రభాకర్,సాగర్,లలిత ఎంపీటీసీ సూడి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపిపి భాస్కర్,గోవింద రావుపేట, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, తెరాస మండల పార్టీ అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య, బిక్షపతి, జీసీసి మెనేజర్ దేవ్ నాయక్, నాయకులు కుండారపు నాగ మల్లయ్య, తడకల మధుకర్ కార్యకర్తలు రైతులు  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: