మన్యం మనుగడ,పినపాక:
పినపాక మండలంలోని టి. కొత్తగూడెం పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పినపాక మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు పరిశీలించారు.మంగళ వారం టి. కొత్తగూడెం గ్రామ పంచాయతీ లో పర్యటించి , గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక , నర్సరీలను సందర్శించినారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి కరోనా గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలు ,సూచనలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ వెంకట్,సర్పంచ్ కణితి చిన్నక్క , కార్యదర్శి అనూష, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: