*నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
*కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలి.
ములుగు ఏఎస్పి పి.సాయి చైతన్య ఐపిఎస్.
మన్యం టీవీ ములుగు:
కరోనా వ్యాప్తిని తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రాత్రి సమయాలలో కర్ఫ్యూ ఆదేశాల కనుగుణంగా ములుగు వర్తక వాణిజ్య వ్యాపారస్తులు
స్వచ్ఛందంగా రాత్రి 7 గంటలకే తమ దుకాణాలను మూసివేస్తున్నట్లు ములుగు ఏఎస్పి పి.సాయి చైతన్య ఐపిఎస్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ములుగు ఏఎస్పి పి.సాయి చైతన్య వ్యాపారస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ వాణిజ్య దుకాణాలలో తప్పనిసరిగ హ్యాండ్ శానిటైజర్ మరియు భౌతిక దూరం, ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా ఉండే విధంగా వినియోగదారులకు సూచనలు ఇవ్వాలని మాస్క్ లేకుండా ఎవరిని తమ దుకాణ సముదాయాలలోకి అనుమతించకుండా అవగాహన తీసుకురావాలని అన్నారు. ప్రజలు కూడా కరోనా వ్యాధి బారిన పడకుండ జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ రాత్రి సమయాలలో బయటికి రాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఈ సందర్భంగా ములుగు ఏఎస్పి పి.సాయి చైతన్య ఐపిఎస్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు సిఐ శ్రీ గుంటి శ్రీధర్, ఎస్సై హరికృష్ణ,పణి పాల్గొన్నారు.
Post A Comment: