చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పరిధిలోని గానుగపాడు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల మైన తమకు కూడా తెలియకుండా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వీటిపై సమగ్ర విచారణ జరిపి అట్టి వారి పై చర్య తీసుకోవాలని, మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో డి అన్నపూర్ణ, కు వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో వినియోగిస్తున్న నిధులు వార్డు సభ్యులకు కూడా తెలియకుండా పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని,వార్డు సభ్యుల సమావేశం ఉందని ఒక రోజు ముందే సంతకాలు సేకరించి తర్వాత సమావేశం ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా తీర్మానాలు చేసుకొని నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, అన్నిట్లో కూడా సర్పంచ్ భర్త తానై వ్యవహరించడంతో మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు ఎంపీడీవో ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని అలాగే సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చాయి.వాటిని ఎలా ఖర్చు చేశారు. అన్ని తెలియజేయాలని వినతిపత్రం ఇచ్చి కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు.. ఉగం కృష్ణవేణి 1వార్డు, చెరుకూరి చందర్రావు 2 వార్డు, బేతి చుక్కమ్మ 3 వార్డు, తాటికూరి చిట్టిబాబు 4 వార్డు, పోతిన్ని రాములు 7 వార్డు, భానోత్ బుజ్జి 8 వార్డు, భుఖ్య రాజి ఎంపీటీసీ, వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు.
Post A Comment: