CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా?‌

Share it:

 



దేశంలో కరోనా‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని ఓ వ్యాక్సిన్‌ కంపెనీ ప్రకటించడంపై ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఒకే దేశం – ఒకే పన్ను కోసం జీఎస్‌టీని అంగీకరించామని, కానీ, ఇప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు చూస్తున్నామని విమర్శించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్‌ నుంచి భరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తికి కేంద్రం ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలను వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: