మన్యం టీవీ : ఇల్లందు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం నుండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినారు. నీతికి నిజాయితీకి పరుడైన ఆదివాసి గిరిజన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల కాలుకు దెబ్బ తగిలింది. కాలుకి ఇన్ఫెక్షన్ కావడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నాయకులు రాయల చంద్రశేఖర్, గుమ్మడి కాలుకు వైద్యం కోసం గత వారం రోజుల క్రితం హైదరాబాద్ తీసుకువెళ్లారు. గత వారం రోజులుగా హాస్పిటల్ లోకి తిరిగిన నేపథ్యంలో బుధవారం కోడి పరీక్ష చేయించుకోగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. గుమ్మడి తన స్వగృహం కారేపల్లి మండలం టేకులగూడెం లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. గుమ్మడి తో పాటు ఉన్న ఆ పార్టీ రాష్ట్ర నేత రాయల చంద్రశేఖర్ హోమ్ ఐసోలేట్ ఉన్నారు. గుమ్మడి నరసయ్య ఆరోగ్యం ప్రస్తుతానికి మంచిగానే ఉందని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.
Post A Comment: