మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో కరోనా బాధితులను చూసి అందరూ భయంతో పరిగెడుతున్నారు.కానీ మంచి మనసు కలిగిన సామాజిక కార్యకర్త కర్నె రవి మాత్రం ఇందుకు భిన్నంగా కరోనా భాదితుల వివరాలు తెలుసుకుని వారి ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా సహాయం ఆందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.ఇందులో భాగంగా గురువారం మణుగూరు మున్సిపాలిటీ గాంధీనగర్ కు చెందిన మాటేటి.వెంకన్న దంపతులకు కరోనా సోకి ఇబ్బందులు పడుతుండటం తో విషయం తెలుసుకున్న కర్నె రవి స్వయంగా వెళ్లి 25 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి,సొతుకు.నవీన్,బాబురావు, వీరబాబు,బాబి,సాంబ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: