మన్యం టీవీ,బూర్గంపాడు
ఐటీసీ-పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ కర్మగారంలో మే-3 న జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐటీసీ-శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్-టిఆర్ఎస్కవి-ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి సమక్షంలో ఐటీసీ-బంజారా ఉద్యోగులు గుగులోత్ వెంకన్న, భూక్యా రమేష్ శ్రామిక శక్తి యూనియన్ లో జాయిన్ అయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గత నలభై సంవత్సరాలుగా మా తండ్రుల దగ్గర నుండి ఇప్పటి వరకు రెండు ప్రధాన యూనియన్లకు మద్దతు ఇస్తూ వచ్చాము కానీ, మమ్మల్ని ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుకున్నారు కానీ మా సమస్యల పట్ల కానీ,మాకు ఉపాధి కల్పనలో కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని, విసిగి పోయామని మొదటిసారిగా ఆ రెండు యూనియన్లకు ప్రత్యామ్నాయంగా మార్పుకు నాంది పలుకుతూ ఏర్పడిన శ్రామిక శక్తి ఎంప్లాయిస్ యూనియన్ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో షేక్ అజీమ్, పూదోట అంతయ్య, దడిగల హరినాధ్,సతీష్ యాదవ్, రామిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: