మన్యం టీవీ మంగపేట.
ఉద్యమ నేత, తెలంగాణ రథసారథి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరగా కరోనా నుండి కోలుకోవాలని మంగపేట మండలంలోని మల్లూర్ శ్రీ హేమాచాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్న మెట్లను తెరాస మండల పార్టీ మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి యూత్ మండల నాయకులు కన్నా సంపత్ మోకాళ్ళ మీదా ఎక్కి శ్రీ హేమాచాల లక్ష్మీ నరసింహస్వామి కి ప్రత్యేకమైన పూజలు చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో వేదపండితులు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసిఆర్ గారు బాగుండాలని కరోనా నుండి తొందరగా కోలుకోవాలని మోకాళ్ళ మీద మెట్లు ఎక్కినట్లు వివరించారు.
Post A Comment: