-కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్
మన్యం మీడియా కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలో ని మాంసం విక్రయదారులు అందరూ తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ *కాపు సీతాలక్ష్మి* తెలిపారు. మటన్ మరియు చికెన్ దుకాణాల యజమానులు అందరూ తప్పనిసరిగా పశువుల వైద్యుని పర్యవేక్షణ అనంతరం స్లాటర్ హౌస్ నందు ఆరోగ్యకరమైన జీవాలను మాత్రమే కట్ చేయాలి అని ఆదేశించారు. మటన్ మరియు చికెన్ షాపులన్నీ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
నియమ నిబంధనలు పాటించని యజమానులకు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రత్యేకంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మాంసం కొనేటప్పుడు తప్పనిసరిగా
*కొత్తగూడెం మటన్ మరియు చికెన్ షాపులకు మున్సిపాలిటీ స్టాంప్* ఉన్న మాంసాన్ని మాత్రమే కొనాలని కోరారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన మాంసాన్ని అందించాలని లేనియెడల మున్సిపాలిటీ అన్ని చర్యలు చేపడుతుందని పట్టణ ప్రజలకు తెలియజేశారు.
Post A Comment: