CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరునాగారం:

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలోని  తెలంగాణ తల్లి విగ్రహం మరియు జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి  తెలంగాణ రాష్ట్ర సమితి 20వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ జెండా  ఆవిష్కరించినారు.

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  గారి పరిపాలన రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అనతికాలంలోనే భారతదేశంలో ప్రత్యేకతను సంతరించుకుంది. మాహాత్మ గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిపాలనలో సహకారం కాబోతుంది అనే నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో పూర్తి నమ్మకం ఉంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ నెంబర్ వలీయాబీ సలీం, ఏటూరునాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, ఎంపీటీసీ కోట నరసింహులు, మండల అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్, మండల జీవ వైద్య సభ్య కార్యదర్శి కాజా పాషా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామ నరసయ్య, చందా లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొమిరి రమేష్ మాజీ మండల అధ్యక్షులు కూనూరు మహేష్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు కొండాయి చిన్ని, యువ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి బోజా రావు, నాయకులు కందగట్ల శ్రీనివాస్, కమ్మరి చంద్రబాబు, రామకృష్ణ, రాజేష్, లక్ష్మణ్,శేఖర్,గాదె లింగాచారి, నాగేశ్వరరావు, బాస శరత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: