CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా కారణంగా శ్రీ నాగులమ్మ ఆలయం స్వచ్చందంగా మూసివేత - ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ రామకృష్ణ స్వామీజీ.

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం వాగొడ్డు గూడెం గ్రామపంచాయతీ లోని లక్ష్మి నర్సాపురం గ్రామం లో ఉన్న శ్రీ నాగులమ్మ దేవాలయం ఈ రోజునుండి రెండు వారాలపాటు స్వచ్చందంగా మూసివేస్తున్నామని శ్రీ నాగులమ్మ ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ బాడిశ రామకృష్ణ స్వామీజీ తెలియజేసారు.కరోనా (సెకండ్ వేవ్ ) మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయం తాత్కాలికంగా మూ సివేస్తున్నామని కావున భక్తులు సహృదయంతో అర్ధం చేసుకొని ఆలయానికి రాకుండా మీ  మీ ఇండ్లలోనే ఉండాలని,అమ్మవారి దర్శనం రెండువారాలపాటు ఉండదని కావునా భక్తులు సహకరించాలని ఆలయ పూజరులు, వడ్డెలు, ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ బాడిశ రామకృష్ణ స్వామీజీ సూచించారు.

ప్రజలందరిని ఉద్దేశించి రామకృష్ణ స్వామీజీ ప్రజలందరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని త్వరలోనే అమ్మవారి దయవల్ల మంచి రోజులు వస్తాయని అంతవరకు ప్రజలందరూ సంయమనం పాటిస్తూ ప్రభుత్వం  ఆదేశాలు పాటించాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి బాడిశ నాగ రమేష్,బాడిశ నవీన్,పూజారులు, వడ్డెలు,గ్రామ పెద్దలు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: