CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పలు వీధులలో బ్లీచింగ్ పౌడర్‌ను జల్లించి ప్రజలకు కొవిడిపై అవగాహన

Share it:

 




  మన్యంటీవీ,అశ్వారావుపేట:

 కోవిడ్ నివారణలో భాగంగా మండలంలోని జమ్మిగూడెం గ్రామ పంచాయతీలో ఆదివారం శానిటేషన్ పనులు చేపట్టారు. కోవిడ్ సెకెండ్ వేవ్ తో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికే పంచాయతీలో పలు చర్యలు చేపట్టగా శనివారం కూడా పంచాయతీ పరిధిలోని ప్రతి ప్రాంతాల్లో పాలక వర్గం ఆధ్వర్యంలో పంచాయతీలోని పలు వీధుల లో బ్లీచింగ్ పౌడర్‌ను జల్లించి ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించారు. కోవిడ్ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో అవసరం ఉంటేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, సెక్రటరీ, పంచాయితీ గుమస్తా, వార్డ్ మెంబెర్స్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: