మన్యం టీవీ కడెం : కమ్యూనిటి పోలీసింగ్ లో భాగంగా నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పి సిహెచ్.ప్రవీణ్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈ రోజు కడం మండలంలోని ఉడుంపూర్ గ్రామ ప్రజలకు, యువకులకు కడం పోలీస్ వారు అవగాహనా కార్యక్రమమునిర్వహించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దానిని కట్టడి చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకు గాను గ్రామా ప్రజలు సహకరించాలని, కరోనా కట్టడికి అందరూ సహకరించాలి, అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుడదని, సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని కోరారు, అలాగే వీలైనంత త్వరలో పనులు ముగించుకొని త్వరగా ఇంటికి చేరాలన్నారు. ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూను జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయడం జరుగుతుందని, వ్యాపారులు నిర్ణీత సమయం లోపు తమ వ్యాపారాలు ముగించుకొని రాత్రి తొమ్మిది లోపు ఇళ్లకు చేరాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని మరియు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మరియు వ్యాపారులు నిర్ణీత సమయంలో దుకాణాలను మూసి వేయాలి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా శుభకార్యాలు నిర్వహిస్తే ఫంక్షన్ హాల్స్ యజమానులతో పాటు నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. కావున ఎవరుకూడా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా శుభకార్యాలు, మీటింగులు, ర్యాలీలు, చేయరాదు. కరోనా మహమ్మారిని తరిమి వేసే వరకు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త లు తీసుకోవాలని , హెల్మెట్ ధరించాలని , రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, మరియు యువకులు , ప్రజలు మావోయిస్టు లకు ఆకర్షణ కి గురికాకుండా వారికీ సహకరించకూడదు అని పోలీస్ లకు సహకరించాలని కోరడం జర్గింది.
ఈ కార్యక్రమలో కడం ఎస్ఐ రాజు, సర్పంచు, గ్రామనికి చెందిన యువకులు మరియు గ్రామస్తులు 100 మంది వరకు హాజరైనారు.
Post A Comment: