మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని చిన్నా రావిగూడెం, రామనుజవరం గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యం లో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మణుగూరు జడ్పీటీసీ పొశం నర్సింహారావు,పీఏసీఎస్ ఛైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతు బీమా,రైతుబంధు,సబ్సిడీ విత్తనాలు,ఎరువులు,24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు పండించిన ధాన్యమును ప్రభుత్వమే రూ.1888 ల మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొన్న డబ్బులను వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పోశం.నరసింహారావు,సొసైటీ చైర్మన్ కుర్రి.నాగేశ్వరావు, వైస్ చైర్మన్ దొండేటి. రామమోహనరావు,అగ్రికల్చర్ ఏవో తాతారావు,సీఈఓ జ్ఞానదాస్,సొసైటీ డైరెక్టర్ పిన్నమనేని.మాధవి,డైరెక్టర్ లు,మండల కో ఆప్షన్ జావిద్ పాషా,టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,వెంకటరెడ్డి,తంత్రపల్లి.కృష్ణ,తాత రమణ, ఉడతాని.రవి,సొసైటీ సిబ్బంది,స్థానిక రైతులు నాగేశ్వరావు,రవి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: