మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం,రామానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని, నిర్వాసిత గ్రామమైన కొత్త మల్లే పల్లి గ్రామంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మౌనిక, మరియు హాస్పిటల్ సిబ్బంది గత రెండు,మూడు రోజులుగా విష జ్వరాలతో పలువురు చనిపోయిన కారణంగా హెల్త్ క్యాంపు నిర్వహించినారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు నిర్వహించిన బ్లడ్ రిపోర్ట్ లు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయ కుమారి, పలువురు అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎవరు అధైర్యపడవద్దు అని, అవసరమైన చర్యలు అన్ని తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి,తహసీల్దార్ చంద్ర శేఖర్,ఎంపీడీవో వీర బాబు,సొసైటీ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు మండల అధ్యక్షుడు ముత్యం బాబు, మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఈవోఆర్డి పి.వెంకటేశ్వర్లు,రామనుజవరం ఉప సర్పంచ్ ప్రభుదాసు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: