👉 కాంగ్రెస్ పార్టీ టిపిసిసి మహిళా ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి.
మన్యం టీవి,ములకలపల్లి మండలం:
అశ్వారావుపేట నియోజక వర్గంలో మహా కూటమి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఓట్లతో ఎమ్మెల్యే గా గెలిచిన మెచ్చ నాగేశ్వరరావు వెంటనే రాజీనామా చేయాలని. టీపీసీసీ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి & ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి డిమాండ్ చేశారు. తల్లిలాంటి తెలుగుదేశం పార్టీ కి ద్రోహం చేయను అని, ప్రజలకు కల్లబొల్లి కబుర్లు ,మాయమాటలు చెప్పి డబ్బులకు ఆశపడి తెలుగుదేశం పార్టీని టిఆర్ స్ లో విలీనం చేయడం.తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంది అని. సున్నం నాగమణి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి అంజూమ్, కుంజా వెంకట్, చిడిపి భాను, ములకలపల్లి మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: