CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ

Share it:

 




మన్యంటీవీ,అశ్వారావుపేట: మండలంలోని స్థానిక తహశీల్ధార్ కార్యాలయం నందు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు నూతన వివాహం చేసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 100116/ రూపాయలు చొప్పున అర్హులైన 36 మందికి 36,04,176 రూపాయల విలువగాల చెక్కులను అర్హులు గల వారికి అందజేయటం జరిగిందని. ఇప్పటి వరకు అశ్వారావుపేట మండలంలోని మొత్తం 8,13,00,176 రూపాయలు చెక్కులను పంపిణీ చేసారని, తెలంగాణ రాష్ట్రం లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అన్ని విధాలా అండగా ఉంటుందని, పేదలకు అనునిత్యం అండగా ఉంటూ ఎన్నో రకాల అభిరువృద్ధి కార్యక్రమాలు చేస్తుందని, కల్యాణ లక్ష్మీ షాధి ముబారక్ పేరుతో నూతనంగా వివాహ జీవితం గడిపే వాళ్ళకి చాలా ఉపయోగ పడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, ఆర్ఐ వెంకటేశ్వర్లు, డీటీ సూచిత్ర తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: