మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు. ముందుగా హోమ శాల లో ఉన్న గరుడ పటాన్ని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ్ సమేత సీతారాముల ధ్వజస్తంభం దగ్గరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ వేద పఠనం చేశారు. ఈ ధ్వజారోహణ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు తెలుపుతున్నానని పండితులు తెలిపారు. గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఇవాళ ఉదయం అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ వైదిక పెద్దలతో పాటు ఈ ఓ శివాజీ ఆలయ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: