CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డిపిఓ పై ఆరోపణలు సరికాదు

Share it:

 


👉 అన్నపురెడ్డిపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం .

మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్. కార్యాలయానికి  పరిమితమై, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడం వలన  ఏజెన్సీ ప్రాంతమైన పలు మండలాల్లో అనుమతులు లేని అక్రమ అపార్ట్మెంట్ కట్టడాలు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు గుర్తించడంలో విఫలమయ్యారు అని. గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో ముడుపుల కోసం ఎంపీవోలను, గ్రామ పంచాయతీ కార్యదర్శులను వేధింపులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలకు , అన్నపురెడ్డిపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం స్పందిస్తూ, నీతి-నిజాయితీకి మారుపేరైన జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్. వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ , పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు తప్ప , ఎటువంటి ముడుపుల కోసం వేధింపులకు గురి చేయలేదని. ఒక నిజాయితీపరుడైన అధికారిపై ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచురించడం సరైందికాదని . వారిపై అన్యాయంగా  ఆరోపిస్తూ వచ్చిన వార్తలను ఖండిస్తూన్నట్లు , అన్నపురెడ్డిపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు వెల్లడించారు.

Share it:

TELANGANA

Post A Comment: